Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు.. దివికేగిన అతిలోకసుందరి

అతిలోకసుందరి అంత్యక్రియలు ముగిశాయి. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి ముంబైకి శ్రీదేవి పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. ఆపై లోఖండ్ వాలాలోని ఆమె నివాసంలో వుంచారు. ఆ తర్వాత అభిమా

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (18:07 IST)
అతిలోకసుందరి అంత్యక్రియలు ముగిశాయి. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి ముంబైకి శ్రీదేవి పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. ఆపై లోఖండ్ వాలాలోని ఆమె నివాసంలో వుంచారు. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్ధం సెలబ్రేషన్స్‌ క్లబ్‌కు తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం అంతిమ యాత్ర బయల్దేరింది. ఆమె పార్థివ దేహాన్ని ఆమెకు ఇష్టమైన ఎరుపు రంగు కాంజీవరం చీర, ఎర్రని బొట్టు, తెల్లని పూలతో దేవకన్యలా అలంకరించారు. 
 
దాదాపు ఏడు కి.మీల మేర సాగిన అంతిమయాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. కడసారి చూపు కోసం అభిమానులు విల్లేపార్లే శ్మశాన వాటికకు చేరుకున్నారు. కుటుంబసభ్యులు, అభిమానుల మధ్య శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. దీంతో ఇక సెలవంటూ.. శ్రీదేవి.. అతిలోకసుందరి మరలిరాని లోకాలకు తరలిపోయారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments