Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన శ్రీదేవి అంత్యక్రియలు.. దివికేగిన అతిలోకసుందరి

అతిలోకసుందరి అంత్యక్రియలు ముగిశాయి. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి ముంబైకి శ్రీదేవి పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. ఆపై లోఖండ్ వాలాలోని ఆమె నివాసంలో వుంచారు. ఆ తర్వాత అభిమా

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (18:07 IST)
అతిలోకసుందరి అంత్యక్రియలు ముగిశాయి. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి ముంబైకి శ్రీదేవి పార్థివదేహాన్ని ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. ఆపై లోఖండ్ వాలాలోని ఆమె నివాసంలో వుంచారు. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్ధం సెలబ్రేషన్స్‌ క్లబ్‌కు తరలించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం అంతిమ యాత్ర బయల్దేరింది. ఆమె పార్థివ దేహాన్ని ఆమెకు ఇష్టమైన ఎరుపు రంగు కాంజీవరం చీర, ఎర్రని బొట్టు, తెల్లని పూలతో దేవకన్యలా అలంకరించారు. 
 
దాదాపు ఏడు కి.మీల మేర సాగిన అంతిమయాత్రలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. కడసారి చూపు కోసం అభిమానులు విల్లేపార్లే శ్మశాన వాటికకు చేరుకున్నారు. కుటుంబసభ్యులు, అభిమానుల మధ్య శ్రీదేవి అంత్యక్రియలు ముగిశాయి. దీంతో ఇక సెలవంటూ.. శ్రీదేవి.. అతిలోకసుందరి మరలిరాని లోకాలకు తరలిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments