Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పదవి ఇస్తానంటే వద్దన్నాడు.. తుపాకీతో కాల్చుకుని చనిపోయాడు.. ఎవరు?

ఆయన ఓ వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త. ఆయన సేవలకు మెచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవిని ఇస్తామని కమలనాథులు కబురు పంపారు. అయితే, తనకు మంత్రి పదవి వద్దని తెగేసి చెప్పారు. అలా చెప్పిన కొన్ని రోజు

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (16:11 IST)
ఆయన ఓ వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త. ఆయన సేవలకు మెచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి పదవిని ఇస్తామని కమలనాథులు కబురు పంపారు. అయితే, తనకు మంత్రి పదవి వద్దని తెగేసి చెప్పారు. అలా చెప్పిన కొన్ని రోజుల్లోనే ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంతకీ ఆయన ఎవరన్నదే కదా మీ సందేహం.
 
ఆయన ఎవరో కాదు.. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్. ఊరు ఇండోర్. మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఈయన మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఆశ్రమంలోనే తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. 
 
తుపాకీ శబ్దంతో షాక్‌కు గురైన ఆయన శిష్యులు భయ్యూజీ గదిలోకి వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు. దీంతో హుటాహుటిన స్వామిజీను ఇండోర్‌ బాంబే ఆసుపత్రికి తరలించారు. భయ్యూజీని పరీక్షించిన వైద్యులు ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు. 
 
గత ఏప్రిల్ నెలలో భయ్యూజీకి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మంత్రి పదవిని ఆఫర్‌ చేసింది. అయితే, దాన్ని భయ్యూజీ తిరస్కరించారు. ప్రజలకు చేరువయ్యేందుకు పదవులు అక్కర్లేదని తెగేసి చెప్పారు కూడా. ఇంతలోనే ఈ విషాదకర నిర్ణయం తీసుకుని తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments