Webdunia - Bharat's app for daily news and videos

Install App

నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (21:12 IST)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది ఎత్తుకు వెళ్లేకొద్ది దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దక్షిణ ఆంధ్రప్రదేశ్‌, దాని పరిసర ప్రాంతాల్లో ఇదివరకే ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో విలీనమైందని తెలిపారు. అక్టోబర్‌ 1 నాటికి రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా, చండీఘడ్‌, ఢిల్లీ పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లోని పలు ప్రదేశాలు, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకోనున్నాయని వెల్లడించారు.

అందుకు అనువైన మార్పులు వాతావరణంలో చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments