Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్‌ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు..

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (14:52 IST)
కరోనా సమయంలో ఎంతో మందికి అండగా నిలిచి రియల్‌ హీరో అనిపించుకున్న ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. సోనూసూద్, అతని భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై నగరంలోని తన నివాస గృహాన్ని హోటల్‌గా మార్చినందుకు సోనూసూద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బీఎంసీ అధికారులు ముంబై పోలీసులను కోరారు. 
 
అవసరమైన అనుమతి తీసుకోకుండా తన నివాస భవనాన్ని సోనూసూద్ హోటల్‌గా మార్చారని బీఎంసీ ఆరోపించింది. ఈ విషయంలో బీఎంసీ అధికారులు సోనూసూద్ కు పలు నోటీసులు పంపినప్పటికీ స్పందించలేదని, అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని బీఎంసీ అధికారులు చెప్పారు. 
 
ఒక భవనాన్ని అక్రమంగా అభివృద్ధి చేశారని, ఆరోపిస్తూ నటుడు సోనుసూద్, అతని భార్య సోనాలి సూద్‌లపై బీఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనూసూద్‌ జుహూలోని శక్తిసాగర్ అనే భవనంలో నివాసం ఉంటున్నారు. ఆరు అంతస్తుల నివాస భవనాన్ని హోటల్‌గా మార్చారని దీనికి సరైన అనుమతి లేదని బీఎంసీ ఆరోపిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments