Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లికోసం వుంచిన పాలలో విషం.. బాలుడు తాగేశాడు.. ఏమైందంటే?

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (14:17 IST)
Cat
పిల్లికోసం వుంచిన పాలను బాలుడు తాగాడు. ఇదే ఆ బాలుడి ప్రాణాపాయ స్థితికి నెట్టింది. వివరాల్లోకి వెళితే.. ఇంటి పనులకు ఆటంకంగా మారిన ఓ పిల్లిని చంపేందుకు పాలలో విషం కలిపారు. కానీ ఆ పాలను పిల్లి తాగకముందే బాలుడు తాగాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గర్హవాలో వెలుగు చూసింది. సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మేధన గ్రామానికి చెందిన ఓ ఇంటిలో పిల్లి ఉంటోంది. 
 
అయితే ఆ పిల్లి చేస్తున్న పనులు ఇంటి సభ్యులకు ఇబ్బందిని కలిగించాయి. ఎలాగైనా పిల్లిని చంపాలనుకుని ఇంటి యజమానురాలు నిర్ణయించింది. దీంతో పాలలో విషం కలిపి గిన్నెలో పెట్టింది. కానీ ఆ పాలను పిల్లి తాగకముందే ఇంట్లో ఉంటున్న 12 ఏండ్ల బాలుడు తాగేశాడు. 
 
తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని సదర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకువచ్చి ఉంటే బాధిత బాలుడి ప్రాణాలకు ముప్పు ఉండేదని వైద్యులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments