Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లికోసం వుంచిన పాలలో విషం.. బాలుడు తాగేశాడు.. ఏమైందంటే?

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (14:17 IST)
Cat
పిల్లికోసం వుంచిన పాలను బాలుడు తాగాడు. ఇదే ఆ బాలుడి ప్రాణాపాయ స్థితికి నెట్టింది. వివరాల్లోకి వెళితే.. ఇంటి పనులకు ఆటంకంగా మారిన ఓ పిల్లిని చంపేందుకు పాలలో విషం కలిపారు. కానీ ఆ పాలను పిల్లి తాగకముందే బాలుడు తాగాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గర్హవాలో వెలుగు చూసింది. సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మేధన గ్రామానికి చెందిన ఓ ఇంటిలో పిల్లి ఉంటోంది. 
 
అయితే ఆ పిల్లి చేస్తున్న పనులు ఇంటి సభ్యులకు ఇబ్బందిని కలిగించాయి. ఎలాగైనా పిల్లిని చంపాలనుకుని ఇంటి యజమానురాలు నిర్ణయించింది. దీంతో పాలలో విషం కలిపి గిన్నెలో పెట్టింది. కానీ ఆ పాలను పిల్లి తాగకముందే ఇంట్లో ఉంటున్న 12 ఏండ్ల బాలుడు తాగేశాడు. 
 
తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని సదర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకువచ్చి ఉంటే బాధిత బాలుడి ప్రాణాలకు ముప్పు ఉండేదని వైద్యులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments