Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగపామును చంపితే.. ఆడపాము తరుముకుంది.. కాపలాకు నలుగురు

ఉత్తరప్రదేశ్‌లో 24 ఏళ్ల యువకుడు ఓ పాముకు భయపడి అదీ ఆడ పాముకు భయపడి... నలుగురిని కాపలా పెట్టుకున్నాడు. ఆ ఆడపాము పగబట్టిందని.. దాని కాటుకు భయపడి సెక్యూరిటీని తన వెంటనే పెట్టుకుని తిరుగుతున్నాడు. తాను గ‌

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (16:23 IST)
ఉత్తరప్రదేశ్‌లో 24 ఏళ్ల యువకుడు ఓ పాముకు భయపడి అదీ ఆడ పాముకు భయపడి... నలుగురిని కాపలా పెట్టుకున్నాడు. ఆ ఆడపాము పగబట్టిందని.. దాని కాటుకు భయపడి సెక్యూరిటీని తన వెంటనే పెట్టుకుని తిరుగుతున్నాడు. తాను గ‌త ఏడాది ఓ మగ పామును చంపాన‌ని, అప్పటి నుంచి ఓ ఆడ పాము త‌న‌పై ప‌గ‌బ‌ట్టి చంపాలని చూస్తోంద‌ని చెప్తున్నాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని షాజ‌హాన్‌పూర్ జిల్లాలో ఓ యువ‌కుడు త‌న‌కు ర‌క్ష‌ణ‌గా న‌లుగురు సెక్యూరిటీ గార్డుల‌ను పెట్టుకున్నాడు. ఆ యువకుడు ఎక్కడకెళ్లినా ఆ నలుగురు గార్డులు కాపలా కాస్తుంటారు. మగపామును చంపి వెళ్తున్నప్పుడు ఆడపాము కొన్ని కిలోమీటర్ల మేర తరుముకుందని.. ఆపై ఎన్నోసార్లు తనపై కాటేసేందుకు ప్రయత్నించిందని తెలిపాడు. 
 
ఆ పామంటేనే భ‌య‌ప‌డిపోతున్న ఆ యువ‌కుడు దానిని చంపినవారికి రూ.5000 రివార్డు కూడా ఇస్తాన‌ని ప్రకటించాడు. ఆ యువ‌కుడి తీరుపై ఆ జిల్లా అధికారులు స్పందించారు. వర్షాకాలం కావడంతో పాముల సంచారం సహజమంటున్నారు. ఆ యువ‌కుడిపై పాము దాడి చేయాల‌ని చూస్తోందనే విషయంలో నిజంలేదంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments