స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. ఐసీయూ తగ్గనుందట.. అంతా జియో ఎఫెక్ట్..

టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన జియో ఉచిత కాల్స్‌ అందించే క్రమంలో ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీలతో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ఛార్జీలను పూర్తిగా తొలగించాలని రిలయన్స్‌ జియో కోరుతోంది. అయితే వీటిని మ

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (15:59 IST)
టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన జియో ఉచిత కాల్స్‌ అందించే క్రమంలో ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీలతో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ఛార్జీలను పూర్తిగా తొలగించాలని రిలయన్స్‌ జియో కోరుతోంది. అయితే వీటిని మరింత పెంచాలని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియావంటి మొబైల్‌ ఆపరేటర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. 
 
ఈ క్రమంలో ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీల(ఐసీయూ)ను తగ్గించేందుకు ట్రాయ్‌ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కాల్ ఛార్జీలు, డేటా ప్యాక్‌లు ధరలు దిగివస్తున్న క్రమంలో ఐసీయూను తగ్గించడం ద్వారా వినియోగదారులు పండగ చేసుకున్నట్లే. ఇప్పటివరకు వివిధ ఆపరేటర్లు కాల్స్‌ను కనెక్ట్‌ చేసేందుకు వసూలు చేస్తున్న ఐసీయూను ప్రస్తుతం నిమిషానికి 14 పైసల నుంచి 10 పైసలకు తగ్గించనున్నారు.
 
గత ఏడాది సెప్టెంబరులో రిలయన్స్ జియో రాకతో మొబైల్ టారిఫ్‌లు ప్రభావితమైన క్రమంలో ఐసీయూ వసూలు కీలకాంశంగా మారింది. అయితే ప్రస్తుతం దాన్ని తగ్గించడం ద్వారా వినియోగదారుల కష్టాలు తగ్గే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments