బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - మావోయిస్టుల హతం

ఠాగూర్
మంగళవారం, 11 నవంబరు 2025 (20:11 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ జిల్లాలోని నేషనల్ పార్కు అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధ సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ వెల్లడించారు. 
 
నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న బీజాపూర్‌, దంతెవాడ, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌ సంయుక్త బృందం ఈ ఆపరేషన్‌ చేపట్టింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆటోమేటిక్ ఆయుధాలు ఇన్సాస్, స్టెన్‌గన్‌లు, 303 రైఫిళ్లు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు  బీజాపూర్‌ ఎస్పీ జితేంద్రయాదవ్‌ తెలిపారు.
 
ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టు కదలికలు ఉన్నట్లు తెలిసిందని, అదనపు బలగాలను అక్కడికి పంపుతున్నట్లు బస్తర్‌రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు. మరోవైపు గరియాబంద్‌ జిల్లాలో నాలుగు గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకోగా.. పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం