Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటో, బైక్‌లను ఢీ కొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు.. ఆరుగురు మృతి

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2022 (11:42 IST)
రాఖీ పండగ సందర్భంగా తమ సోదరుల ఇంటికి వెళ్లి తిరిగొస్తుండగా గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆటో, బైక్‌లను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు, బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో  ముగ్గురు మహిళలు ఉన్నారు.  
 
ప్రమాదానికి కారణమైన కారు కాంగ్రెస్ ఎమ్మెల్యే పూనంభాయ్ మాధాభాయ్ అల్లుడు ఖేతన్ పధియార్‌ది కావడం గమనార్హం. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హైవేపై అతివేగంతో దూసుకొచ్చిన కియా సెల్టోస్ ఎస్‌యూవీ ఒక ఆటోను, బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. 
 
మృతులను జియాబెన్ మిస్త్రీ, జాన్వీబెన్ మిస్త్రీ, వీణాబెన్ మిస్త్రీ, యాసన్ వోహ్రా, యోగేశ్, సందీప్‌లుగా గుర్తించారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు ఖేతన్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు. 
 
ఈ ప్రమాద ఘటనపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రమాదానికి కారణమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడు ఖేతన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

Deepika: ప్రభాస్ తో లిప్ లాక్ చేయనని స్పిరిట్ వద్దన్నా : దీపికా పదుకొనె

అర్థరాత్రి తాగి ఖలేజాను చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే : సి. కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments