Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుడు మంటల్లో కాలిపోతుంటే.. వీడియో షూట్

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి ఒక్కరూ సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు అమితాసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా, తమ కళ్ల ఎదుట ఏం జరుగుతుందనే విషయాన్ని విస్మరించి సెల్ఫీల కోసమే ఎగబడుతున్నారు.

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2017 (10:49 IST)
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి ఒక్కరూ సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు అమితాసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా, తమ కళ్ల ఎదుట ఏం జరుగుతుందనే విషయాన్ని విస్మరించి సెల్ఫీల కోసమే ఎగబడుతున్నారు. 
 
తాజాగా ఢిల్లీలోని సాకుర్‌ బస్తీ రైల్వే స్టేషన్‌ ఆవరణలో ఓ దారుణం జరిగింది. ఓ యువకుడు మంటల్లో కాలిపోతుంటే దాన్ని తమ సెల్‌ఫోన్‌లో షూట్ చేసేందుకు స్థానికులు అమితాసక్తిని చూపారు. ఫలితంగా అందరూ చూస్తుండగానే రక్షించాలని కేకలు వేస్తూ నిలువునా కాలిపోయాడు. 
 
మృతుడు 20 యేళ్ల వయసు కలిగిన సిక్కు యువకుడిగా గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెపుతున్నారు. ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అతన్ని రక్షించేందుకు ఎవరూ ప్రయత్నించక పోవడంతో ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. కాగా, ఆత్మహత్యకు ముందు గంటసేపు స్టేషన్‌ ఆవరణలోనే తచ్చాడాడని స్థానికులు చెపుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments