కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

ఠాగూర్
సోమవారం, 17 నవంబరు 2025 (21:29 IST)
కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు హస్తినలో మకాం వేసివున్నారు. వారిద్దరూ కలిసి ఢిల్లీలోని కర్నాటక భవన్‌కు వెళ్లారు. రాష్ట్రంలో నాయకత్వం మార్పుపై విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వేళ సిద్ధరామయ్య, డీకేలు ఢిల్లీలో కనిపించడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. 
 
ఆ తర్వాత పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సిద్ధు భేటీ అయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా తానే పూర్తి కాలం కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని పరోక్షంగా అధిష్ఠానాన్ని కోరిన సిద్ధరామయ్య.. తదుపరి (2028) ఎన్నికలకు శివకుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిద్దామని సూచించినట్లు సమాచారం. మరోవైపు పార్టీ అధిష్ఠానం తనను ఏ విషయమైనా అడిగేంత వరకు మౌనంగా ఉండాలని శివకుమార్‌ భావిస్తున్నారు.
 
ఇదిలావుంటే, కర్ణాటక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ కానున్నారు. ఖర్గే నివాసంలో వీరు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణపైనే ఆయన చర్చిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఆదివారం డీకే, ఖర్గే భేటీ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments