Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరద్ పవార్ వెన్ను పోటు: శివసేన సంచలన వ్యాఖ్యలు

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (08:02 IST)
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ పై శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. పవార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి  శరద్ పవార్ వెన్ను పోటు పొడిచారని పార్టీ సీనియర్ నేత అనంత్ గీతె అన్నారు.

మహారాష్ట్రలో నిర్వహించిన ఓ ర్యాలీలో అనంత్ గీతె మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ పార్టీకి వెన్ను పోటు పొడిచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని శరద్ పవార్ ఏర్పాటు చేశారు. 1999లో ఆయనతో సహా మరో ఇద్దరిని పార్టీ నుంచి తొలగిస్తే ఆ పార్టీ ఏర్పడింది.

అనంతరం మహారాష్ట్రలో అదే కాంగ్రెస్ పార్టీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి వ్యక్తి మాకెప్పటికీ నాయకుడు కాదు. మహావికాస్ అగాడీ (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వం) ప్రభుత్వం కేవలం కొన్ని సర్దుబాట్లతో ఏర్పడ్డది’’ అని అన్నారు.
 
భారతీయ జనతా పార్టీతో కొనసాగిన రెండు దశాబ్దాల పొత్తును తెంచుకుని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన మళ్లీ బీజేపీ వైపుకు వెళ్తోందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా పార్టీ సీనియర్ నేత అనంత్ గీతే చేసిన వ్యాఖ్యలు అందుకు మరింత ఊతమిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కొద్ది రోజుల క్రితం శివసేన అధికారిక పత్రిక సామ్నాలో మోదీని పొగుడుతూ ఆర్టికల్ రావడం, అనంతరం బీజేపీ నేత, కేంద్ర మంత్రిని ‘‘సహజ మిత్రుడు, భవిష్యత్‌లో కలిసి పనిచేయొచ్చు’’ అంటూ శివసేన అధినేత, సీఎం ఉద్దవ్ థాకరే అంటూ వ్యాఖ్యానించడం ఇందుకు ప్రధాన కారణాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments