ముందుగానే చనిపోయిన వాజ్‌పేయి.. మోడీ ప్రసంగానికి అడ్డొస్తుందనీ... ?!

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిపై ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన ఓ ధర్మసందేహాన్ని లేవనెత్తింది. ఆ సందేహం ప్రకారం వాజ్‌పేయి ఆగస్టు 15వ తేదీ కంటే ముందుగానే చనిపోయారన్న భావన కలిగిస్తో

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (14:47 IST)
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిపై ఎన్డీయే భాగస్వామ్య పార్టీల్లో ఒకటైన శివసేన ఓ ధర్మసందేహాన్ని లేవనెత్తింది. ఆ సందేహం ప్రకారం వాజ్‌పేయి ఆగస్టు 15వ తేదీ కంటే ముందుగానే చనిపోయారన్న భావన కలిగిస్తోంది. ఈ మేరకు ప్రత్యేక కథనాన్ని శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ప్రచురించింది.
 
ఈ పత్రిక సంపాదకీయంలో 'ప్రజలకంటే ముందుగా.. మన నేతలు స్వరాజ్యం గురించి సరిగా అర్థం చేసుకోవాలి. వాజ్‌పేయి ఆగస్టు 16న మృతిచెందారు. కానీ 12-13 తేదీల నుంచే ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమిస్తోంది. ఉత్సాహంగా జరగాల్సిన స్వాతంత్ర్య దినోత్సవం దేశవ్యాప్తంగా సంతాపదినాలు, జెండాల అవనతం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఎర్రకోట మీదుగా సుదీర్ఘమైన ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకు వాజ్‌పేయి మృతిని 16న ప్రకటించారా?' అని 'స్వరాజ్యమంటే ఏంటి?' అనే శీర్షికతో ప్రచురించిన సంపాదకీయంలో శివసేన రాజ్యసభ ఎంపీ, సామ్నా ఎడిటర్‌ సంజయ్‌ రౌత్‌ సందేహం లేవనెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments