Webdunia - Bharat's app for daily news and videos

Install App

షీనా బోరా హత్య కేసు : ఇంద్రాణి ముఖర్జియాకు కోర్టులో చుక్కెదురు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాకు కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. కన్నబిడ్డ షీనా బోరా హత్య క

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (17:15 IST)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాకు కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు సీబీఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. కన్నబిడ్డ షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాను ముంబై పోలీసులు అరెస్టు చేసి జైల్లో బంధించారు. 
 
ఈ నేపథ్యంలో ఇంద్రాణి ముఖర్జియా తండ్రి ఇటీవల మరణించారు. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గౌహతి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె వేసిన మధ్యంత బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. గౌహతికి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేమని... కావాలంటే పోలీసుల భద్రత మధ్య ముంబైలో అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని సూచన చేసింది. 
 
అంతేకాదు, మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయరాదని షరతు విధించింది. 2012లో షీనాబోరాను హత్యచేసి, రాయఘడ్ అడవుల్లో పాతిపెట్టిన సంగతి తెలిసిందే. ఇదే కేసుకు సంబంధించి ఆమె మూడో భర్త పీటర్ ముఖర్జియా కూడా జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఇంద్రాణి ముఖర్జియా ప్రధాన నిందితురాలిగా ఉన్న విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

తర్వాతి కథనం
Show comments