Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వారకా శారదా పీఠం స్వరూపానంద స్వామి శివైక్యం

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (20:31 IST)
గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతీ శివైక్యం చెందారు. ఆలయ వయస్సు 99 యేళ్లు. గత కొంతతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన.. మధ్యప్రదేశ్‌ నర్సింగాపుర్‌లోని శ్రీధాం జోతేశ్వర్‌ ఆశ్రమంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. 
 
స్వామి స్వరూపానంద సరస్వతీ 1924లో మధ్యప్రదేశ్‌లోని దిఘోరీ గ్రామంలో జన్మించారు. తొమ్మిదేళ్లకే ఇంటిని వదిలి మతప్రచార యాత్రలు చేపట్టారు. స్వాతంత్య్ర సంగ్రామంలోనూ పాల్గొన్నారు. 
 
ఈయన మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‍, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ తదితరులు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. 
 
స్వరూపానంద శివైక్యం.. సాధు సమాజానికి తీరని లోటని యోగీ ఆదిత్యనాథ్‌ ట్వీట్‌ చేశారు. భారతీయ జ్ఞాన సంప్రదాయాలకు స్వామి చేసిన సేవలు యావత్ ప్రపంచం చిరకాలం గుర్తుంచుకుంటుందని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments