Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరికి పట్టిన శని వదిలింది: కిరణ్‌బేడీ తొలగింపుపై ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (08:20 IST)
పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ తొలగింపుపై మల్లాడి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పుదుచ్చేరికి పట్టిన శనిని వదిలించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు.

యానాం కేంద్రంగా పుదుచ్చేరి రాజకీయం నడుస్తోందని, రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని అద్భుతాలు చూడడానికి యానాం ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. యానాం అభివృద్ధి కోసమే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అన్నారు.

జనవరి 6న మంత్రి పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రికి పత్రాన్ని ఇచ్చానన్నారు. అభి మానులకు, కార్యకర్తలకు గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానన్నారు. యానాం బాగుకోసం, అందరి శ్రేయస్సు కోసం రాబోయే రోజుల్లో తన నిర్ణయాలు చాలా పెద్దవిగా ఉంటాయన్నారు.

పదవిలో ఉన్నా లేకున్నా నా ఊరు బాగుపడాలి, పథకాలకు ఇబ్బంది రాకూడదు, ఇంకా అనేక ప్రాజెక్టులు తీసుకురావాలన్నదే తన ధ్యేయమన్నరు. తన 31ఏళ్లఅనుభవంతో యానాం కోసం మల్లాడి సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రజలు అనుకునేలా తన నిర్ణయం ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments