Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకతాయి చేష్టలు : ఇంటికి నిప్పు.. ఆరుగురి సజీవదహనం

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (17:18 IST)
ఓ అకతాయి చేసిన చేష్టల కారణంగా ఇంటికి నిప్పు అంటుకుని ఆరుగురు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని కొడగు జిల్లాలోని పొన్నంపేట పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మద్యం మత్తుల్లో ఉన్న ఓ వ్యక్తి ఓ ఇంటికి తాళం వేసి నిప్పుపెట్టాడు. ఈ సమయంలో ఇంట్లో 8 మంది ఉండగా.. ముగ్గురు మంటలు అంటుకొని సజీహ దహనమయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
 
వారిని వెంటనే మైసూర్‌లోని కేఆర్‌ హాస్పిటల్‌కు తరలించారు. ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. 
 
ఈ ఘటన జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు. బేబి (45), సీత (40), ప్రార్థన (6), విశ్వస్ (3), విశ్వస్ (6), ప్రకాశ్‌ (7) మృతి చెందగా.. భాగ్య (40), పాచే (60) హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. సంఘటనపై పొన్నంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం