Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురు మృతి

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (10:17 IST)
కర్నాటక రాజధాని బెంగళూరులో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు.

కోరమంగళ మార్స్‌ వెల్ఫేర్‌ హాల్‌ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్నేహితులు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

ఫ్రంట్‌ సీటులో ముగ్గురు, వెనుక సీటులో మిగతా నలుగురు కూర్చున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులంతా 20 నుంచి 30 ఏండ్ల లోపు వయసున్న వారే.. కరుణా సాగర్‌, బిందు (28), అక్షరు గోయల్‌, ఇషిత (21), ధనూష (21), రోహిత్‌, ఉత్సవ్‌ ఉన్నారు.

కరుణా సాగర్‌, బిందు భార్యాభర్తలు. సెయింట్‌ జాన్స్‌ హాస్పిటల్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌ బ్యాగ్‌ ఓపెన్‌ కాలేదని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఏడుగురిలో ఏ ఒక్కరూ కూడా సీటు బెల్ట్‌ ధరించలేదని నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments