Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురు మృతి

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (10:17 IST)
కర్నాటక రాజధాని బెంగళూరులో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు.

కోరమంగళ మార్స్‌ వెల్ఫేర్‌ హాల్‌ వద్ద కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు స్నేహితులు మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.

ఫ్రంట్‌ సీటులో ముగ్గురు, వెనుక సీటులో మిగతా నలుగురు కూర్చున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులంతా 20 నుంచి 30 ఏండ్ల లోపు వయసున్న వారే.. కరుణా సాగర్‌, బిందు (28), అక్షరు గోయల్‌, ఇషిత (21), ధనూష (21), రోహిత్‌, ఉత్సవ్‌ ఉన్నారు.

కరుణా సాగర్‌, బిందు భార్యాభర్తలు. సెయింట్‌ జాన్స్‌ హాస్పిటల్‌లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్‌ బ్యాగ్‌ ఓపెన్‌ కాలేదని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఏడుగురిలో ఏ ఒక్కరూ కూడా సీటు బెల్ట్‌ ధరించలేదని నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments