Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్నేహితుల ప్రాణాలు గాలిలో..?

చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్నేహితుల ప్రాణాలు గాలిలో..?
, శనివారం, 28 ఆగస్టు 2021 (16:24 IST)
చేవెళ్లలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాదు శివారులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు యువకులు స్నేహితులే కావడం గమనార్హం. 
 
గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే... ఫ్రెండ్ బర్త్ డేకు కేక్ కోసమని.. బైక్‌పై చేవెళ్లకు బయలుదేరారు. గుర్తు తెలియని వాహనం అతివేగంతో వీరు ప్రయాణిస్తున్న బైక్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్నేహితులు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. 
 
పుట్టిన రోజే జయవర్ధన్‌తో సహా అతని స్నేహితులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలిచివేసింది. ముగ్గురు స్నేహితుల మృత్యువాతతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైసూరు యువతిపై గ్యాంగ్ రేప్: షాక్‌లో బాధితురాలు, అదుపులో ఐదుగురు నిందితులు