Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏనుగుతో సెల్ఫీలా..?

Webdunia
బుధవారం, 30 డిశెంబరు 2020 (19:30 IST)
ఏపీ-ఒడిశా సరిహద్దులో ఏనుగుల గుంపు ఒకటి సందడి చేసింది. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురం గ్రామ పరిసరాల్లో మూడు రోజులుగా ఏనుగుల గుంపు ఒడిశా వైపు వెళ్లింది. స్వర్ణాపురం తీరంలో స్థానిక బాహుదానదిని ఏనుగుల గుంపు దాటుతుండగా ఓ చిన్న ఏనుగు గుమ్మిలో చిక్కుకుపోయింది.
 
ఈ విషయాన్ని గమనించిన స్థానిక యువకులు దాన్ని ఒడ్డుకు తీసుకువచ్చి సరదాగా ఆడుకున్నారు, సెల్ఫీలు దిగారు. బిడ్డ ఇంకా రావట్లేదని అమ్మ ఏనుగు కంగారుగా వెనక్కు వచ్చింది.

అక్కడ పిల్లలు గున్న ఏనుగు చుట్టూ గుమికూడి దాన్ని పట్టించడం చూసి ఆగ్రహంతో ఊగిపోయింది తల్లి ఏనుగు. దాన్ని అలా చూసేసరికి బిక్కచచ్చిపోయిన యువకులు పరుగులు తీశారు.
 
అదే సమయంలో నదిలో చేపలు పడుతున్న ఓ యువకుడు ఏనుగు రాకను గమనించక అక్కడే ఉండిపోయాడు. తల్లి ఏనుగు అతడిపై దాడి చేసింది. కిందపడేసి తొక్కినంత పని చేసింది. సమయానికి దగ్గరలో ఉన్న యువకులు, స్థానికులు పరుగున వచ్చి ఏనుగును తరిమేశారు.

ఏనుగు దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ సీన్ మొత్తాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments