Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు మహిళలపై దొంగ బాబా అత్యాచారం.. ఆశ్రమం ముసుగులో..?

Webdunia
గురువారం, 6 మే 2021 (20:45 IST)
మహిళలపై అకృత్యాలు రోజురోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. రాజస్థాన్‌లోని జైపూరులో దొంగ బాబా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన ఆశ్రమంలో నలుగురు మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇందులో ముగ్గురు మహిళలు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం మరింత కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. తపస్వి ఆశ్రమంలో సత్సంగంలో పాల్గొనేందుకు వెళ్లిన తమపై బాబా శైలేంద్ర మెహతా అత్యాచారానికి పాల్పడినట్టు బాధితులు ఫిర్యాదు చేశారని భంక్రోటా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముకేశ్ చౌదరి పేర్కొన్నారు. సేవల పేరుతో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నట్లు బాధితులు వెల్లడించారు. 
 
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు మంగళవారం ఫిర్యాదు చేయగా... మరో బాధితురాలు బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.
 
బాధితుల్లో ఒకరు తన కుమార్తెను ఆశ్రమానికి తీసుకెళ్లొద్దంటూ తన భర్తకు అడ్డుపడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ''ఆమె తనకు జరిగిన దారుణాన్ని చెప్పడంతో... అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు మహిళలు కూడా ధైర్యం చేసి నిందితుడి దురాగతాన్ని బయటపెట్టారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments