Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ - భద్రత కట్టుదిట్టం

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (14:12 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పంచాయతీ రాజ్ దివస్‌ను పురస్కరించుకుని ఆయన పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఆ రాష్ట్ర పర్యటనకు వెళుతున్నారు. 
 
దాదాపు 30 వేల మంది పంచాయతీ సభ్యులు పాల్గొనే ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం భారీ బందోబస్తును కల్పించారు. ఈ సమావేశం సాంబా జిల్లాల పల్లి పంచాయతీ నుంచి దేశ వ్యాప్తంగా వర్చువల్ విధానంలో ఆయన ప్రసంగించనున్నారు. 
 
ఈ సందర్భంగా రైతులు, సర్పంచులు, గ్రామ పెద్దలు తమ ఆదాయాలు పెంచుకునేలా కొత్త ఆవిష్కరణలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 
ఇటీవల ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ఆ తర్వాత భద్రతా బలగాలు జరిపిన దాడిలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments