Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ - భద్రత కట్టుదిట్టం

Webdunia
ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (14:12 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పంచాయతీ రాజ్ దివస్‌ను పురస్కరించుకుని ఆయన పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఆ రాష్ట్ర పర్యటనకు వెళుతున్నారు. 
 
దాదాపు 30 వేల మంది పంచాయతీ సభ్యులు పాల్గొనే ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం భారీ బందోబస్తును కల్పించారు. ఈ సమావేశం సాంబా జిల్లాల పల్లి పంచాయతీ నుంచి దేశ వ్యాప్తంగా వర్చువల్ విధానంలో ఆయన ప్రసంగించనున్నారు. 
 
ఈ సందర్భంగా రైతులు, సర్పంచులు, గ్రామ పెద్దలు తమ ఆదాయాలు పెంచుకునేలా కొత్త ఆవిష్కరణలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ పోలీసులతో పాటు కేంద్ర భద్రతా బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 
ఇటీవల ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ఆ తర్వాత భద్రతా బలగాలు జరిపిన దాడిలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments