Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. అస్త్రశస్త్రాలతో విపక్షాలు సిద్ధం

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (09:25 IST)
పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో బీజేపీపై ఎదురుదాడి చేసేందుకు అస్త్రశస్త్రాలతో విపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరిగాయి. ఆ తర్వాత రెండో విడత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ ఆరో తేదీ వరకు జరుగుతాయి. ఈ సమావేశాల్లోనే కేంద్ర బడ్జెట్ ఆమోదం, గ్రాంట్లపై చర్చ వాడివేడిగా సాగనుంది.
 
ఫైనాన్స్ బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం, అదానీ వ్యవహారం, ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై కేంద్రాన్ని తూర్పారబట్టాలని విపక్షాలు తమ వద్ద ఉన్న ఆధారాలతో పాటు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. అదానీ - హిండెన్ బర్గ్ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఉభయ సభల్లో ఆందోళన చేయనుంది.
 
మరోవైపు, రెండో విడత బడ్జెట్ సమావేశాలపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ స్పందిస్తూ, ఈ సమావేశాల్లో ఫైనాన్స్ బిల్లులను ఆమోదింపజేసుకోవడమే తమ ప్రథమ ప్రాధాన్యత అంశంమని, ఆ తర్వాతే విపక్ష పార్టీల డిమాండ్లపై చర్చిస్తామని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments