Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాహుల్‌కు సుప్రీంకోర్టు షాక్... మోడీని దొంగ అని మేమన్నామా?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (14:05 IST)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ దొంగ అంటూ సాక్షాత్ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నోటీసు జారీ చేసింది. పైగా, ఈనెల 22వ తేదీలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. 
 
భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య కుదిరిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా, తాజాగా 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. అయితే, ఈ ఒప్పందంలో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నట్లు రాహుల్ గత కొన్నిరోజులుగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల లీకైన రఫేల్ పత్రాల ఆధారంగా గతంలో రఫేల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును పున:సమీక్షించేందుకు సుప్రీం అంగీకరించింది.
 
ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టు హర్షం వ్యక్తంచేసింది. చౌకీదార్ చోర్(మోడీ దొంగ) అని సుప్రీంకోర్టే చెప్పిందని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పుతో రఫేల్ ఒప్పందంలో ఏదో తప్పు ఉందని తేటతెల్లమైందన్నారు. దీనిపై బీజేపీ పార్లమెంటు సభ్యురాలు మీనాక్షి లేఖి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకే వస్తాయని పేర్కొంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు... రాహుల్‌కు నోటీసు జారీ చేసింది. పైగా, ఈనెల 22వ తేదీన కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆదేశిస్తూ తదుపరి విచారణను 23వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments