Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్రీ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (21:28 IST)
బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసు విచారణ లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. ఆగస్ట్ 31లోపు కేసుపై విచారణను పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు తొమ్మిది నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలంటూ ఆదేశించింది. 
 
అయితే, ఆ గడువు ఏప్రిల్ నెలాఖరుతో ముగిసింది. దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్‌డౌన్ ప్రభావం కేసు విచారణ మీద కూడా పడిందని, మరికొంత గడువు కావాలంటూ సీబీఐ కోర్టు జడ్జి సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం ఆగస్ట్ 31 వరకు గడువును పొడిగించింది. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని, ఈ సారి ఆగస్ట్ 31 గడువును మాత్రం దాటొద్దని స్పష్టం చేసింది. 
 
ఈ కేసులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి. విచారణకు సుప్రీంకోర్టు 2017లో రెండు సంవత్సరాల గడువు ఇచ్చింది. 2019లో గడువు పూర్తవడంతో మరో 9 నెలలు పొడిగించింది, ఆ గడువు కూడా ముగియడంతో మరో 4 నెలలు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంచితే సీబీఐ కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్ 2019లోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ఈ కేసుపై విచారణ కోసం ఆయన పదవీకాలాన్ని కూడా పొడిగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments