Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్రీ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (21:28 IST)
బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసు విచారణ లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. ఆగస్ట్ 31లోపు కేసుపై విచారణను పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు తొమ్మిది నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలంటూ ఆదేశించింది. 
 
అయితే, ఆ గడువు ఏప్రిల్ నెలాఖరుతో ముగిసింది. దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్‌డౌన్ ప్రభావం కేసు విచారణ మీద కూడా పడిందని, మరికొంత గడువు కావాలంటూ సీబీఐ కోర్టు జడ్జి సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం ఆగస్ట్ 31 వరకు గడువును పొడిగించింది. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని, ఈ సారి ఆగస్ట్ 31 గడువును మాత్రం దాటొద్దని స్పష్టం చేసింది. 
 
ఈ కేసులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి. విచారణకు సుప్రీంకోర్టు 2017లో రెండు సంవత్సరాల గడువు ఇచ్చింది. 2019లో గడువు పూర్తవడంతో మరో 9 నెలలు పొడిగించింది, ఆ గడువు కూడా ముగియడంతో మరో 4 నెలలు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంచితే సీబీఐ కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్ 2019లోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ఈ కేసుపై విచారణ కోసం ఆయన పదవీకాలాన్ని కూడా పొడిగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments