Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబ్రీ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (21:28 IST)
బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసు విచారణ లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. ఆగస్ట్ 31లోపు కేసుపై విచారణను పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో సుప్రీంకోర్టు తొమ్మిది నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలంటూ ఆదేశించింది. 
 
అయితే, ఆ గడువు ఏప్రిల్ నెలాఖరుతో ముగిసింది. దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్‌డౌన్ ప్రభావం కేసు విచారణ మీద కూడా పడిందని, మరికొంత గడువు కావాలంటూ సీబీఐ కోర్టు జడ్జి సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం ఆగస్ట్ 31 వరకు గడువును పొడిగించింది. అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని, ఈ సారి ఆగస్ట్ 31 గడువును మాత్రం దాటొద్దని స్పష్టం చేసింది. 
 
ఈ కేసులో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషితో పాటు మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి. విచారణకు సుప్రీంకోర్టు 2017లో రెండు సంవత్సరాల గడువు ఇచ్చింది. 2019లో గడువు పూర్తవడంతో మరో 9 నెలలు పొడిగించింది, ఆ గడువు కూడా ముగియడంతో మరో 4 నెలలు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంచితే సీబీఐ కోర్టు జడ్జి ఎస్‌కే యాదవ్ 2019లోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ ఈ కేసుపై విచారణ కోసం ఆయన పదవీకాలాన్ని కూడా పొడిగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments