Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జగన్‌ అక్రమాస్తుల కేసు : ఇన్‌ కెమెరా ప్రొసీడింగ్స్‌కు ఆదేశం... కష్టాలు తప్పవా?

జగన్‌ అక్రమాస్తుల కేసు : ఇన్‌ కెమెరా ప్రొసీడింగ్స్‌కు ఆదేశం... కష్టాలు తప్పవా?
, శుక్రవారం, 10 జనవరి 2020 (11:30 IST)
వైకాపా అధినేత, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా, శుక్రవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఈ కేసులో ఏ1 నిందితుడుగా ఉన్న జగన్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో హాజరయ్యారు. అలాగే, ఏ2గా ఉన్న వైకాపా నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావులు కూడా హాజరయ్యారు. 
 
అయితే, ఈ కేసు విచారణ సందర్భంగా నాంపల్లి సీబీఐ కోర్టు జగన్మోహన్ రెడ్డికి తేరుకోలేని షాకిచ్చింది. ఈ కేసు విచారణను ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్‌కు న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో కేసులోని నిందితులతో వారి తరపు న్యాయవాదులు కూడా ఒకింత షాక్‌కు గురయ్యారు.
 
నిజానికి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కేవలం కొన్ని రకాల కేసులకు మాత్రమే అనుమతిస్తారు. అత్యాచారానికి సంబంధించిన కేసులు, దేశ భద్రతకు, రాజ్యాంగానికి సంబంధించిన కేసులను మాత్రమే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్‌కు అనుమతిస్తారు. 
 
అయితే, జగన్ అక్రమాస్తుల కేసులో అత్యంత కీలకం కావడంతో పాటు ప్రజాప్రయోజనాలకు, అక్రమ ఆదాయాల, కోట్లాది రూపాయల ఆర్థిక ప్రయోజనాలు, భిన్న కంపెనీల లావాదేవీలు తదితర అంశాలతో ముడిపడివుండటం వల్లే న్యాయమూర్తి ఈ తరహా ప్రొసీడింగ్స్‌కు ఆదేశించివుంటారని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజధాని ప్రాంత ప్రజలు చేసే సన్మానం కళ్లారా చూడాలనివుంది...