Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ళ శిక్షపై అప్పీల్ చేస్తే 34 యేళ్ల శిక్ష విధించిన కోర్టు

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (08:20 IST)
తనకు విధించిన ఆరేళ్ళ శిక్షా కాలంపై అప్పీల్ చేసిన ఓ బాధితురాలికి కోర్టు ఏకంగా 34 యేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. సౌదీ అసమ్మతి నేతల ట్వీట్లను రీట్వీట్లు చేయడమే ఆమె చేసిన నేరం. పైగా, బాధితురాలు లీడ్స్ విశ్వవిద్యాలయంలో రీసెర్స్ స్కాలర్‌గా ఉంటున్నారు. ఈమె సౌదీలో అడుగుపెట్టగానే సౌదీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ విస్మయం చెందే ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
బ్రిటన్‌లోని లీడ్స్ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్న సల్మా గతేడాది జనవరిలో సెలవులకు సౌదీ వచ్చారు. దేశంలో ఆమె అడుగుపెట్టగానే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సౌదీలోని అసమ్మతి నేతల ట్వీట్లను రీట్వీట్ చేసిన అభియోగాలపై ఆమెను అరెస్ట్ చేశారు. 
 
ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం సల్మాకు తొలుత ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో ఆ తీర్పును సల్మా పైకోర్టులో సవాలు చేశారు. అయితే, అక్కడామెకు చేదు అనుభవం ఎదురైంది. పై కోర్టు ఆమెకు ఏకంగా 34 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలి పేరు సల్మా అల్ షెబాజ్. అక్కడి మైనారిటీ వర్గమైన షియా ముస్లిం వర్గానికి చెందిన ఆమెకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments