Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నమ్మ జైలు నుంచి వచ్చేస్తోందట.. అన్నాడీఎంకేలో మళ్లీ లుకలుకలు..?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (13:54 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె నెచ్చెలి శశికళ కర్ణాటక జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కర్ణాటకలోని పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమె.. ఆ రాష్ట్ర జైళ్ల శాఖ నిబంధనల ప్రకారం విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
 
సాధారణంగా స్వల్పకాల శిక్షకు గురైన వారు మూడోవంతు శిక్షను పూర్తి చేసుకుంటే ఆపై ఎప్పుడైనా విడుదల కావచ్చు. ఈ నిబంధనల ప్రకారం. జయలలిత అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల శిక్షకు గురైంది. దీని ప్రకారం చిన్నమ్మకు శిక్షాకాలం 2021తో పూర్తవుతుంది. 
 
అయితే, సత్ప్రవర్తన, రాష్ట్ర చట్టాల ప్రకారం, ఆమె శిక్షాకాలం ముగియకుండానే బాహ్య ప్రపంచంలోకి శశికళ వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈమెతో పాటు ఇళవరసి, సుధాకరన్‌లు కూడా మూడేళ్ల జైలు శిక్ష ముగియకుండానే విడుదల అవుతారని జాతీయ మీడియా కోడైకూస్తోంది. 
 
అయితే, శశికళకు జైలుశిక్షతో పాటు రూ. 10 కోట్ల జరిమానాను కూడా సుప్రీంకోర్టు ఖరారు చేసింది. ఈ మొత్తాన్ని ఇప్పటివరకు శశికళ చెల్లించలేదు. జరిమానా డబ్బు కోసం ఆమె ఆస్తులను జప్తు చేసేందుకు తమిళనాడు సర్కారు ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments