Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీకే శశికళ ఇళ్లపై దాడులు.. 1050 ఎకరాల భూమి స్వాధీనం

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:04 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లపై దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి కేసులో నాలుగేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన శశికళ తర్వాత చెన్నైకి చేరుకున్న మూడు రోజులకే ఆమె సంబంధీకులపై దాడులు మొదలయ్యాయి.
 
కాంచీపురం, తంజావూర్‌, తిరువారూర్‌, చెంగల్పట్టు జిల్లాల్లోని పలు ఆస్తులను అధికారులు జప్తు చేశారు. కాంచీపురంలో రూ.300 కోట్ల విలువైన 144 ఎకరాలకు పైగా భూమి, తంజావూర్‌లో 26 వేల చదరపు అడుగుల భూమి, తిరువారూర్‌లో సుమారు 1050 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములన్నీ శశికళ, ఆమె కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయని, ఇవన్నీ 1994-96 మధ్య కొనుగోలు చేసినవేనని పోలీసులు తెలిపారు.
 
అక్రమాస్తుల కేసులో కోర్టు ఆదేశాల మేరకే తాము దాడులు చేశామని అధికారిక ప్రకటనల్లో ఆయా జిల్లాల అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగడానికి మూడు నెలల ముంగిట జైలు నుంచి శశికళ విడుదలైన నేపథ్యంలో ఈ దాడులు జరుగడం కొన్ని సందేహాలు, అనుమానాలకు తావిస్తున్నాయి. ఇందులో రాజకీయ కక్ష సాధింపేమీ లేదని, కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం స్పందిస్తుందని రాష్ట్ర సీఎం ఈకే పళనిస్వామి చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments