Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీకే శశికళ ఇళ్లపై దాడులు.. 1050 ఎకరాల భూమి స్వాధీనం

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:04 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లపై దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి కేసులో నాలుగేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన శశికళ తర్వాత చెన్నైకి చేరుకున్న మూడు రోజులకే ఆమె సంబంధీకులపై దాడులు మొదలయ్యాయి.
 
కాంచీపురం, తంజావూర్‌, తిరువారూర్‌, చెంగల్పట్టు జిల్లాల్లోని పలు ఆస్తులను అధికారులు జప్తు చేశారు. కాంచీపురంలో రూ.300 కోట్ల విలువైన 144 ఎకరాలకు పైగా భూమి, తంజావూర్‌లో 26 వేల చదరపు అడుగుల భూమి, తిరువారూర్‌లో సుమారు 1050 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములన్నీ శశికళ, ఆమె కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయని, ఇవన్నీ 1994-96 మధ్య కొనుగోలు చేసినవేనని పోలీసులు తెలిపారు.
 
అక్రమాస్తుల కేసులో కోర్టు ఆదేశాల మేరకే తాము దాడులు చేశామని అధికారిక ప్రకటనల్లో ఆయా జిల్లాల అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగడానికి మూడు నెలల ముంగిట జైలు నుంచి శశికళ విడుదలైన నేపథ్యంలో ఈ దాడులు జరుగడం కొన్ని సందేహాలు, అనుమానాలకు తావిస్తున్నాయి. ఇందులో రాజకీయ కక్ష సాధింపేమీ లేదని, కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం స్పందిస్తుందని రాష్ట్ర సీఎం ఈకే పళనిస్వామి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments