Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమాన ప్రయాణం మరింత ప్రియం... ఫ్లైటెక్కాలంటే జేబుకు చిల్లే

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:02 IST)
దేశంలో విమాన ప్రయాణం మరింత ప్రియంకానుంది. ఇకపై ఫ్లైటెక్కాలంటే జేబుకు చిల్లుపడాల్సిందే. దేశీయ విమాన ప్రయాణ టికెట్ ధరలను పది నుంచి 30 శాతం వరకు ప్రభుత్వం పెంచింది. 
 
గతేడాది మే నుంచి జెట్ ఫ్యూయల్ ధరలు భారీగా పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన కేంద్రం.. సవరించిన చార్జీలు ఈ ఏడాది మార్చి 31 వరకు , లేదంటే తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.
 
సవరించిన చార్జీల ప్రకారం.. ప్రయాణకాలం 40 నిమిషాల వరకు ఉంటే రూ.200 నుంచి గరిష్టంగా రూ.1,800 వరకు, 40 నుంచి 60 నిమిషాల ప్రయాణ కాలానికి రూ.300-రూ.2,700, 90 నిమిషాల వరకు ఉంటే రూ.300-రూ.2,800, 60 నుంచి 90 నిమిషాల వరకు ఉండే ప్రయాణకాలానికి కనిష్టంగా రూ.300 నుంచి గరిష్టంగా రూ.2,700 వరకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది.
 
ప్రయాణ కాలం 90 నిమిషాల నుంచి 120 నిమిషాల వరకు ఉంటే రూ.400 - రూ.3వేలు, ప్రయాణ కాలం 120 నిమిషాల నుంచి 150 నిమిషాల వరకు ఉంటే రూ.500 - రూ.3,900, 150 నిమిషాల నుంచి 180 నిమిషాల వరకు ఉండే ప్రయాణ కాలానికి కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.4,700 వరకు అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ కాలం 180 నిమిషాల నుంచి 210 నిమిషాల వరకు ఉంటే కనిష్టంగా రూ.700 నుంచి గరిష్టంగా రూ.5,600 వరకు చేతి చమురు వదిలించుకోక తప్పదన్నమాటే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments