Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంబులెన్స్‌లో చిన్నమ్మకు భోజనం, పండ్లు, డ్రైఫ్రూట్స్, పాలు, పెరుగు..?

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న చిన్నమ్మ శశికళకు రాజభోగాల సంగతి రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. దీంతో కర్ణాటక సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా కర్ణాటక సర్కారు చిన్నమ్మపై నిఘా వుం

Webdunia
బుధవారం, 26 జులై 2017 (10:09 IST)
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్న చిన్నమ్మ శశికళకు రాజభోగాల సంగతి రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. దీంతో కర్ణాటక సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా కర్ణాటక సర్కారు చిన్నమ్మపై నిఘా వుంచింది. హోసూరు నుంచి అంబులెన్సులో ఆమెకు రకరకాల వస్తువులు వస్తున్నాయని తేలింది. ఈ వ్యవహారం వెనుక కర్ణాటకకు చెందిన ఓ మంత్రి హస్తం ఉందని తేలడంతో ఆయన ఎవరనే దానిపై చర్చ మొదలైంది.
 
జైలులో ఓ ఎస్ఐ స్థాయి అధికారి వీఐపీ సౌకర్యాలు కల్పించడంతోనే తరిస్తున్నట్లు ఓ అనామకుడు కర్ణాటక డీజీపీ మొదలు, కీలక అధికారులందరికీ రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో కర్ణాటక సర్కారు విచారణను వేగవంతం చేసింది. చిన్నమ్మకు జైలులో ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయనే దానిపై నిఘా వుంచింది. తద్వారా శశికళకు మరిన్ని చిక్కులు తప్పవని రాజకీయ వర్గాల సమాచారం.
 
కాగా.. పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారని డీఐజీ రూప బయటపెట్టిన విషయం తెలిసిందే. శశికళ వ్యవహారం బయటపడటంతో జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణరావ్ తో సహ డీఐజీ రూప తదితరులను బదిలి చేశారు. ప్రతి రోజు మూడు పూటల శశికళకు కావాలసిన అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) మధ్యాహ్నం, రాత్రికి అవసరం అయిన భోజనంతో పాటు తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్, పాలు, పెరుగు తదితర ఆహార పదార్థాలను ఎస్ఐ గజరాజ్ మాకనూర్ జైలు బయట నుంచి తెప్పించి చిన్నమ్మకు సప్లై చేస్తున్నారని కొత్త విషయంలో వెలుగులోకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments