Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత సమాధి వద్ద కన్నీరు కార్చిన శశికళ

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (16:39 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె శనివారం స్థానిక మెరీనా తీరంలోని జయలలిత, ఎంజీఆర్ స్మారక మందిరాలకు నివాళులు అర్పించారు. అన్నాడీఎంకే పార్టీ స్వర్ణోత్సవ వేడుకలు ఆదివారం జరుగనున్నాయి. దీంతో శశికళ ఒక రోజు ముందుగానే ఈ సమాధుల వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. 
 
ఆ సమయంలో జయలలిత సమాధి వద్ద శశికళ వందలాది మంది అనుచరులతో భారీ ర్యాలీగా చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జయలలిత సమాధి వద్ద ఆమె భావోద్వేగంతో కంటతడి పెట్టారు. జయకు నివాళి అర్పించిన శశికళ... కన్నీళ్లను తుడుచుకుంటూ పుష్పాంజలి ఘటించారు.
 
ముఖ్యంగా, శశికళ ప్రయాణించిన వాహనంపై అన్నాడీఎంకే జెండా ఉండటం గమనార్హం. దీనిపై అన్నాడీఎంకే నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తి పార్టీ జెండాను ఎలా పెట్టుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు.
 
ఇదిలావుంటే, జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను పూర్తి చేసుకుని బెంగుళూరు పరప్పణ అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన బెంగుళూరు నుంచి చెన్నైకు చేరుకోగా, ఆయనకు ఆయన మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments