విమానాలతో సానిటైజేషన్ - గాలిలో కరోనాకు చెక్

Webdunia
సోమవారం, 31 మే 2021 (09:10 IST)
గాలి ద్వారా కరోనా వైరస్​ వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనల మధ్య వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది ఏరియల్​వర్క్స్​ ఏరో ఎల్​ఎల్​పీ అనే సంస్థ. చిన్నపాటి విమానాల సాయంతో క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తోంది.
 
ఆఫ్రికా, అమెరికాలో ఇప్పటికే ఈ సంస్థ భారీ స్థాయిలో ఏరియల్​ స్ప్రే పనులు చేపట్టింది. ఆధునిక సాంకేతికతతో సేంద్రీయ ద్రావణాన్ని మైక్రాన్ల పరిమాణంలో పిచికారీ చేసి, గాలిలో ఎక్కువ సమయం ఉండేలా చేస్తుంది.

దాంతో గాలి తుంపర్లలో తేలియాడే బ్యాక్టీరియా, వైరస్​ను నశింపజేసి, కొవిడ్​ సోకే ముప్పును తగ్గిస్తుంది.బెంగళూరులోని అత్యధిక జనాభా గల ప్రాంతాల్లో పిచికారీ కోసం ఏరోవర్క్క్​ తో 3 రోజుల పైలట్​ ప్రాజెక్టును ప్రారంభించారు కర్ణాటక ఆర్థిక మంత్రి ఆర్​.అశోక్.
 
300  లీటర్ల లోడింగ్​ సామర్థ్యంతో గంటకు 741 ఎకరాల్లో అమెరికన్​ ఛాంపియన్​ స్కౌట్​ విమానంతో క్రిమిసంహాకర ద్రావణాన్ని పిచికారీ చేస్తోంది ఏరోవర్క్స్​ ఎల్​ఎల్​పీ.

మంచి ఫలితాల కోసం ఐసీఎంఆర్​ ధ్రువీకరించిన ఎయిర్​లెన్స్​ మైనస్ కరోనా, సుగరధాన అనే రెండు రకాల సేంద్రీయ ద్రావణాల్ని వాడుతోంది. ఈ రెండూ రసాయన రహిత, మానవ సురక్షిత ద్రావణాలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం