Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిరూపిస్తే.. పార్లమెంట్‌లోనే ఆత్మహత్య చేసుకుంటా : ఎస్పీ ఎంపీ

పాకిస్థాన్ గూఢచర్య కేసులో తనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే పార్లమెంట్ భవన్‌లోనే తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు మనవార్ సలీమ్ ప్రకటించారు.

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (11:19 IST)
పాకిస్థాన్ గూఢచర్య కేసులో తనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే పార్లమెంట్ భవన్‌లోనే తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు మనవార్ సలీమ్ ప్రకటించారు. 
 
ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పని చేసే దౌత్యాధికారి గూఢచర్యం కేసులో అరెస్టు అయిన విషయం తెల్సిందే. అతని వద్ద జరిపిన విచారణలో ఎస్పీ ఎంపీ సలీమ్‌కు పీఏగా ఉన్న ఫర్హత్ అనే వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ వీసా అధికారి మెహమూద్ అఖ్తర్‌తో ఫర్హత్ కుమ్మక్కై గూఢచర్యానికి పాల్పడ్డాడు. ఫర్హాత్‌తో పాటు కీలకమైన రక్షణ పత్రాలు చేతులు మారేందుకు సహకరించిన మౌలానా రంజాన్, సుభాష్ జాంగిర్‌ అనే ఇద్దరు ఢిల్లీ క్రైం బ్రాంచ్ అరెస్టు చేశారు. 
 
దీనిపై సలీం ఘాటుగానే స్పందించారు. భారత్‌లోని పాక్ హైకమిషన్ అధికారులతో తనకు సంబంధాలున్నాయని నిరూపిస్తే తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. 'నా జీవితం తెరిచిన పుస్తకం. ఏడాది క్రితం ఫర్హాత్ నా దగ్గరకు వచ్చారు. అతని వెరిఫికేషన్ కోసం ఆ సమాచారాన్ని నేను పార్లమెంటుకు, ప్రభుత్వానికి పంపాను' అని తెలిపారు. గూఢచర్యం సిండికేట్‌లో ఫర్హాత్‌కు సంబంధం ఉందో తాను నిశ్చయంగా చెప్పలేనని, అయితే ఢిల్లీ పోలీసులు సహా మూడు సంస్థల విచారణ తర్వాత ఫర్హాత్‌కు క్లీన్ చిట్ వచ్చినందునే అతన్ని తన పీఏగా నియమించుకున్నట్టు సలీమ్ వివరణ ఇచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య కేసు.. లావణ్యను హత్య చేయాలని ప్లాన్ చేశాడా?

సినిమా మేకింగ్ గ్యాంబ్లింగ్ అందుకే రెండు సినిమాల్లో వందకోట్లు పోయింది : శింగనమల రమేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments