Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాన్స్‌జెండర్‌ను కొట్టి చంపిన తల్లి, బంధువులు?

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (16:37 IST)
తమిళనాడులో ట్రాన్స్‌జెండర్ హత్యకు గురైంది. తల్లి, బంధువులు కలిసి ట్రాన్స్‌జెండర్ మహిళగా మారిన ఒక యువకుడిని హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. సేలం నగరానికి చెందిన ఉమాదేవి జులైలో తన కుమారుడు నవీన్ కుమార్ కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కొన్ని రోజుల తరువాత పోలీసులు అతన్ని పట్టుకొని కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టులో నవీన్ కుమార్.. తాను ఒక మహిళగా మారిపోయానని.. దీంతో ఇంట్లో తల్లి, బంధువుల గొడవ చేస్తుండడంతో పారిపోయి విడిగా ఉంటున్నానని చెప్పాడు. అందుకు కోర్టు..  అతను ఒక మహిళగా జీవించేందుకు అధికారం ఉందంటూ తీర్పునిచ్చింది. 
 
ఈ నెల 13న తల్లిని చూడడానికి నవీన్ కుమార్‌ ఇంటికి రాగా అతను ఇంటి పరువు తీస్తున్నాడంటూ తల్లి, బంధువులు చితకబాదారు. అతడికి బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్ వేయాలని కూడా ప్రయత్నించారు. 
 
ఈ క్రమంలో అతను ప్రతిఘటించేసరికి తల్లి ఉమాదేవి అతడిని బలంగా కొట్టింది. దాంతో నవీన్ కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ నెల 14న మృతిచెందాడు. పోలీసులు నవీన్ మరణించక ముందు అతడి వాంగ్మూలం తీసుకున్నారు. మృతుడి తల్లి, బంధువులపై హత్య కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments