Webdunia - Bharat's app for daily news and videos

Install App

47 ఏళ్లైనా పెళ్లి కాలేదు.. 15ఏళ్లుగా మహిళతో ఆ లింకు.. కన్నతల్లి అడ్డుగా వుందని?

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (17:22 IST)
అక్రమ సంబంధానికి కన్నతల్లి అడ్డంకిగా మారిన కారణంగా.. ఆమె కుమారుడు దారుణానికి ఒడిగట్టాడు. వివాహేతర సంబంధానికి అడ్డు చెప్తుందని.. కన్నతల్లినే నిద్రమాత్రలు ఇచ్చి.. చీరను నోటిలో కుక్కి హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడు, సేలంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా, అమ్మాపేటకు చెందిన కామరాజర్ కాలనీకి చెందిన రాజేంద్రన్ భార్య నల్లమ్మాల్ (65)కు 47ఏళ్ల వయస్సులో శివకుమార్ అనే కుమారుడు, లత అనే కుమార్తె వున్నారు. శివకుమార్‌కు 47 ఏళ్లైనా వివాహం కాలేదు. ఈ నేపథ్యంలో లత కన్నతల్లి ఆరోగ్యం బాగోలేదని పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో నోటిలో చీరకుక్కి.. అనుమానస్పద రీతిలో తల్లి మృతి చెందిన విషయాన్ని గమనించి షాకైంది. 
 
ఇంతలో తల్లిని హతమార్చినట్లు శివకుమార్ పోలీసుల ముందు లొంగిపోయాడు. అతని వద్ద పోలీసులు జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. జయలక్ష్మి అనే మహిళతో 15 సంవత్సరాల పాటు శివకుమార్‌కు వివాహేతర సంబంధం వుందని తెలిసింది. 
 
జయలక్ష్మి అప్పుడప్పుడు శివకుమార్ ఇంటికి తీసుకువచ్చేవాడని.. దీన్ని అతని తల్లి ఖండించిందని తెలిసింది. ఇలా తన అక్రమ సంబంధానికి అడ్డుగా వున్న కన్నతల్లిని నిద్రమాత్రలు ఇచ్చి.. నోటిలో చీరను కుక్కి చంపేసినట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments