Webdunia - Bharat's app for daily news and videos

Install App

మకర సంక్రాంతి ముగిసింది.. శబరిమల ఆలయం మూసివేత

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (15:21 IST)
కేరళ శబరిమలలో మకర సంక్రాంతికి అనంతరం వారం వ్యవధిలో ఆలయాన్ని మూసివేస్తారు. కుంభ నెల పూజల నిమిత్తం ఆలయాన్ని తిరిగి ఫిబ్రవరి 12న సాయంత్రం 5:30 గంటలకు తెరవనున్నారు. 
 
దీంతో శాస్త్రోక్తంగా అయ్యప్ప దేవాలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవసం బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి ఏటా.. కార్తీకమాసంలో ఆలయాన్ని తెరిచి భక్తులకు, అయ్యప్ప స్వాములకు దర్శనం కల్పిస్తారు. 
 
ఫిబ్రవరి నెలలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా ఆలయ అధికారిక వెబ్ సైట్‌లో డేట్లు సరిచూసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
 
కాగా ఆలయం మూసివేత సందర్భంగా రాజకుటుంబీకులు మూలం తిరున్నాల్ శంకర్ వర్మ.. గురువారం ఉదయం గణపతి హోమం నిర్వహించారు. అనంతరం వంశాచారం ప్రకారం రాజు అయ్యప్ప స్వామిని దర్శించుకుని సేవలో పాల్గొన్నారు. 
 
సేవల అనంతరం స్వామి వారి "తిరువాభరణం" పందళంలోని ఆలయానికి తరలిస్తారు. నాలుగు రోజుల పాటు ప్రయాణించి తిరువాభరణం ఆదివారానికి పందళం చేరుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments