Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం పళనిస్వామి సర్కారును గట్టెక్కించిన తమిళనాడు స్పీకర్...

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. అధికారం కోసం జరుగుతున్న కుమ్ములాటలో దినకరన్ వర్గానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది.

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (10:14 IST)
తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. అధికారం కోసం జరుగుతున్న కుమ్ములాటలో దినకరన్ వర్గానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది. పార్టీ విప్‌ను ధిక్కరించారని 18మంది ఎమ్మెల్యేలను అనర్హుల్ని చేస్తూ శాసనసభ స్పీకర్ ధన్‌పాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారును గట్టెక్కించినట్టేనని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 మంది సభ్యులుండగా బలపరీక్ష నిర్వహిస్తే, పళనిస్వామి ప్రభుత్వానికి 117 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ, అంత బలం అన్నాడీఎంకేలోని పళని - పన్నీర్ వర్గానికి లేదు. ప్రస్తుతం 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో అసెంబ్లీలో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 234 నుంచి 216కు చేరింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గం ఆర్కేనగర్ స్థానం ప్రస్తుతం ఖాళీగా ఉంది. 
 
దీంతో పళనిస్వామి అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గాలంటే 107 మంది సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది. ఇది పళనిస్వామి ప్రభుత్వం నెత్తిన పాలుపోసినట్లే. అనర్హత వేటు తర్వాత అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 116 మంది ఎమ్మెల్యేలుండగా, డీఎంకేకు 89 మంది, కాంగ్రెస్‌కు 8 మంది సభ్యులు, ఐయూఎంఎల్ సభ్యుడు ఒకరు ఉన్నారు. దీంతో అసెంబ్లీలో బలపరీక్ష జరిగినా పళనిస్వామి ప్రభుత్వం గట్టెక్కినట్టే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments