Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో తెలుగు అయ్యప్ప భక్తులపై దాడి.. (Video)

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (14:39 IST)
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయంలో తెలుగు అయ్యప్ప భక్తులపై మంగళవారం ఉదయం దాడి జరిగింది. స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులపై ఆలయ భద్రతా సిబ్బంది దాడి చేశారు. దీంతో ఆలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యూలైన్లలో ఉన్న అయ్యప్ప భక్తుకు, ఆలయ భద్రతా సిబ్బంది మధ్య గొడవ జరిగింది. ఇది తీవ్ర వాగ్విదానికి దారితీయడంతో భక్తులపై ఆలయ సిబ్బంది దాడి చేశారు. చేతికి అందిన వస్తువలతో కొట్టడంతో ఏపీకి చెందిన భక్తుల్లో పలువురికి రక్తపు గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర గాయాలపాలైన ఇద్దరు ఏపీ అయ్యప్ప భక్తులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ఘటనపై ఏపీ భక్తులు క్యూలైన్లలోనే కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఆలయ భద్రతా సిబ్బంది (పోలీసులు)కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్వామివారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్థానిక పోలీసులు ఆలయంలోకి చేరుకోవడంతో భద్రతా సిబ్బందిపై ఏపీ భక్తులు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలతో పాటు ఏపీ భక్తుల ఆందోళనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో ఐదుగురు అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments