Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జిల్లాలో అలజడి సృష్టించిన పులిని చంపేయాలంటూ సర్కారు ఆదేశం

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (14:02 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ఓ పులి అలజడి సృష్టించింది. శనివారం ఓ రైతుపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ ప్రభుత్వం ఆ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. మృతి చెందిన రైతును వయనాడ్‌కు చెందిన ప్రకాశ్‌గా గుర్తించగా వయసు 36 సంవత్సరాలు. శనివారం పొలంలోకి పచ్చిగడ్డి కోసం వెళ్లగా, పులి దాడి చేసింది. 
 
ఈ దాడిలో ప్రకాశ్ మృతి చెందిడంతో అతని శరీరంలో సగ భాగాన్ని ఆరగించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని తరలించవద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనపై స్పందించిన స్థానికులు... ఆ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. 
 
అయితే, ఆ పులి మ్యాన్ ఈటర్ అవునా కాదా అనే విషయాన్ని ధృవీకరించుకోవాలని సూచించింది. ఆ పులి మ్యాన్ ఈటర్ అని తేలిన తర్వాత దానిని అదుపులోకి తీసుకోలేకపోతే, దానిని చంపేయాలి" అని పేర్కొంది. ప్రస్తుతం దాని జాడ గుర్తించేందుకు పలు ప్రాంతాల్లో అటవీ శాఖ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ జనవరిలో కూడా వయనాడ్‌లో ఈ తరహా ఘటనే జరిగింది. అపుడు కూడా పులి దాడి చేసిన ఘటనలో 52 యేళ్ల రైతు ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments