Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్ పదవీకాంక్ష కోసం పనిచేసి... ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (09:31 IST)
ఐప్యాక్ అధినేత, ఎన్నికల జాతీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పదవీకాంక్ష కోసం పని చేసిచేశానని తెలిపారు. నిజానికి ఈ పని చేయడానికి బదులు కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణకు పాటుపడి ఉండాల్సింది అని అభిప్రాయపడ్డారు. 
 
రాజకీయాల్లో మార్పు కోసం జన్ సురాజ్ పేరుతో ఆయన మహాత్మాగాంధీ జయంతి రోజున పశ్చిమ చంపరాన్ జిల్లాలోని భితిఙర్వా నుంచి 3500 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహాత్మాగాంధీ 1917లో ఇక్కడి నుంచి మొదటి సత్యాగ్రమ ఉద్యమాన్ని ప్రారంభించారు. తాజాగా ఈ యాత్ర ఆదివారం లౌరియాకు చేరుకుంది. 
 
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ల కోసం పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవానికి కృషి చేసివుంటే బాగుండేదని అన్నారు. అసలైన మహాత్మా గాంధీ కాంగ్రెస్‌కు పునరుజ్జీవం పోయడంద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమనే విషయాన్ని సత్యం తనకు ఆలస్యంగా అర్థమైందన్నారు. 
 
అంతేకాకుండా, బీజేపీని అర్థం చేసుకోకుండా ఆ పార్టీని ఓడించడం కష్టమని విపక్ష కూటమికి సూచించారు. ఓ కప్పులో ఉండే పైపే నురగే బీజేపీ అయితే, దానికింద ఉండే అసలైన కాఫీయే ఆర్ఎస్ఎస్ అని అన్నారు. సామాజిక వ్యవస్థలో అది భాగమైపోయిందని, షార్ట్‌కట్స్‌తో దానిని ఓడించలేమన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments