కేబుల్ వంతెన తెగిపోయిన ఘటనలో 141కు చేరిన మృతులు

Webdunia
సోమవారం, 31 అక్టోబరు 2022 (09:14 IST)
గుజరాత్ రాష్ట్రంలోని మచ్చూ నదిపై వందేళ్ల క్రితం నిర్మించిన కేబుల్ వంతెన శనివారం తెగిపోయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య శనివారానికి 141కిపైగా చేరింది. ప్రమాద సమయంలో వంతెనపై 500కు పైగా పర్యాటకులు ఉన్నారు. ఈ ప్రమాదం శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో జరిగింది. 
 
ఇక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. వంతెన కూలిపోవడంతో నదిలో పడిన అనేక మంది పర్యాటకులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అలాగే సహాయక సిబ్బంది కూడా 170 మందికి వరకు రక్షించారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. గల్లైంతవారి జాడ కోసం బోట్ల సాయంతో ప్రయత్నిస్తున్నారు. 
 
కాగా, వందేళ్ల క్రితం అంటే బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెనకు ఇటీవలే మరమ్మతు పను చేశారు. గుజరాతీ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నెల 26వ తేదీన తిరిగి ప్రారంభించి, పర్యాటకులను అనుమతించారు. ఆదివారం కావడంతో అనేక మంది పర్యాటకులు ఈ వంతెనపైకి వచ్చి మృత్యువొడిలోకి చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments