Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. ఆర్ఆర్ఎస్ చీఫ్ ఎమన్నారు?

ఠాగూర్
శనివారం, 12 అక్టోబరు 2024 (11:25 IST)
పొరుగుదేశం బంగ్లాదేశ్‌లోని భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. దీంతో ఆ దేశంలో నివసిస్తున్న భారత హిందూ పౌరులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ ఈ దాడులపై ఆర్ఆర్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో ఉన్న హిందువులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల సాయం కావాలని వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం సాయం చేయడం వారికి చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. బలహీనంగా ఉండటం నేరమవుతుందని మోహన్ భగవత్ అన్నారు. 
 
'మనం బలహీనంగా ఉన్నామంటే నేరాలను ఆహ్వానిస్తున్నట్టే. మనం ఎక్కడ ఉన్నా ఐక్యంగా, సాధికారికంగా ఉండాలి' అని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం జరిగిన ఓ దసరా ఉత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై ఆయన స్పందించారు. 
 
మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌లో ఏం జరిగింది. అందుకు కొన్ని తక్షణ కారణాలు ఉండొచ్చు. కానీ, సంబంధించినవారు దీనిపై చర్చించారు. దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పటికీ హిందువులపై అఘాయిత్యాలకు పాల్పడటం అక్కడ పునరావృతమవుతోంది. అయితే, తొలిసారి హిందువులు వారి రక్షణ కోసం ఐక్యంగా ఢిల్లీలోకి వచ్చారు. బంగ్లాదేశ్‌లో ఇదేవిధంగా దాడులు కొనసాగితే హిందువులే కాదు.. అక్కడి మైనారిటీలు అందరూ ప్రమాదంలో పడతారు" అని మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments