Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమావాస్య రోజున మాత్రమే అలా చేస్తారు..

Webdunia
శుక్రవారం, 15 మార్చి 2019 (15:57 IST)
దొంగతనం చేయడానికి కూడా ఒకరోజును ఎంచుకుంది ఓ దొంగలముఠా. కేవలం అమావాస్య రోజున మాత్రమే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారింది. ఇది కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. అమావాస్య రోజున దొంగతనాలు చేస్తుండడంతో వారిని అమావాస్య గ్యాంగ్ అని పిలుస్తారు. 
 
అమావాస్య గ్యాంగ్‌లోని ఇద్దరు నిందితులను నెలమంగల తాలూకా దాబస్‌పేట పోలీసులు అరెస్టు చేసారు. నిందితులు తుమకూరు టౌన్‌ సీతకల్లు గ్రామం నివాసి గణేశ్, తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా వడ్డగెరె గ్రామం నివాసి వినయ్‌కుయార్‌లుగా గుర్తించారు. వీరు కేవలం అమావాస్య రోజే బైక్‌ చోరీలకు పాల్పడుతుండడం విశేషం.
 
నిందితులు బెంగళూరు, తుమకూరు, నెలమంగల పరిధిలోనే బైక్‌లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడేవారు. చోరీ చేసిన బైక్‌లను స్నేహితుల సహాయంతో కస్టమర్‌లకు విక్రయించేవారు. రెండు రోజుల క్రితం బెంగళూరు గొట్టగెరెలో యమహా ఎఫ్‌జడ్‌ బైక్‌ చోరీ చేసి తుమకూరు వైపు వెళ్తుండగా లక్కూరు గ్రామం వద్ద దాబస్‌పేట పోలీసులు పట్టుకున్నారు. 
 
ఇద్దరినీ విచారించగా.. నిజం బయటకు వచ్చింది. తమ వద్ద 13 ఖరీదైన బైక్‌లు ఉన్నాయని వారు తెలిపారు, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీరి గ్యాంగ్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎక్కడెక్కడ చోరీలు చేసారనే సమాచారం కోసం విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments