Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్లపై నుంచి జారిపడిన లాలూ ప్రసాద్ యాదవ్ - భుజం విరిగింది

Webdunia
సోమవారం, 4 జులై 2022 (15:07 IST)
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ ఇంట్లోని మెట్లపై నుంచి జారిపడ్డారు. దీంతో ఆయన భుజం ఎముక విరిగింది. ఆదివారం ఈ సంఘటన జరిగింది. దీంతో ఆయన్ను పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
74 యేళ్ళ లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పైగా, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ యేడాది మొదట్లో డిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. దాణా స్కామ్‌లో దోషిగా తేలడంతో మొదట్లో 2017 డిసెంబరు నెలలో ఆయనకు జైలుశిక్ష ఖరారైంది. 
 
ఈ ఏప్రిల్ నెలలో ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయన పాట్నాలోని తన నివాసంలోనే ఉంటూ, ఆదివారం మెట్లపై నుంచి జారి పడ్డారు. దాంతో భుజం ఎముక విరగడంతో పాటు వెన్నెముకకు కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments