Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియా చక్రవర్తి ఓ విషకన్య.. కాంట్రాక్ట్ కిల్లర్

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (15:06 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. ప్రతి ఒక్కరూ సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని దోషిగా చూస్తున్నారు. ఈ క్రమంలో రియా చక్రవర్తిపై సుశాంత్ తండ్రి పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... ఆమెను విచారించేందుకు బీహార్ పోలీసులు ముంబైకి వెళ్లారు. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్యపై పలువురు ప్రముఖులు అనుమానాలను వ్యక్తం చేశారు.
 
ఈ నేపథ్యంలో జేడీయూ నేత మహేశ్వర్ హజారీ మాట్లాడుతూ, రియా చక్రవర్తిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ను హత్య చేశారని... దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని ఆయన ఆరోపించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. 
 
రియా ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌గా వ్యవహరించిందని అన్నారు. ప్రేమ పేరుతో సుశాంత్‌ను మోసం చేసిందని... డబ్బు తీసుకుని, వెళ్లిపోయిందని చెప్పారు. ఆమె ఒక విషకన్య అని అన్నారు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే సుశాంత్ వద్దకు రియాను పంపించారని... ఈ కోణంలో విచారణ జరగాలని అన్నారు.
 
సుశాంత్ కేసును ముంబై పోలీసులు సరిగా విచారించడం లేదని... ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ విచారణ జరగాలని మహేశ్వర్ డిమాండ్ చేశారు. సుశాంత్ కుటుంబానికి బీహార్ ప్రభుత్వం అండగా ఉంటుందని... ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తుందని చెప్పారు. సుశాంత్‌కు న్యాయం జరగాలని సీఎం నితీశ్ కుమార్ కూడా కోరుకుంటున్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments