Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 17 నవంబరు 2024 (14:40 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు పోకిరీ విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారు. తమకు చదువు చెప్పే ఉపాధ్యాయురాలి కుర్చీ కింద బాంబు పెట్టి, రిమోట్‌తో పేల్చారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఆ టీచర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హర్యానాలోని ఓ పాఠశాలలో 12వ తరగతి విద్యాభ్యాసం చేసే కొందరు విద్యార్థులను సైన్స్ పాఠాలు బోధించే మహిళా టీచర్ తిట్టారు. అల్లరి పనులుమాని చదువుపై దృష్టిసారించాలని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు విద్యార్థులకు ఏమాత్రం రుచించలేదు. తరగతి గదిలో తమను అవమానించిన టీచర్‌పై విద్యార్థులు ద్వేషం పెంచుకున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి బాణాసంచాతో బాంబు తయారు చేసి, దానిని టీచర్ కుర్చీ కింద అమర్చారు. టీచర్ క్లాస్ రూంలోకి వచ్చి ఆ కుర్చీలో కూర్చొన్న తర్వాత రిమోట్ సాయంతో బాంబును పేల్చారు. 
 
ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్కూలు మొత్తం ఉలిక్కిపడింది. ఈ పేలుడు ధాటికి కుర్చీ దెబ్బతింది. అయితే, అదృష్టవశాత్త టీచర్‌ మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై మండిపడిన ప్రిన్సిపాల్.. ఈ పనికి పాల్పడిన విద్యార్థులందరినీ సస్పెండ్ చేసి, విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments