Publish Date: Sat, 11 May 2024 (16:30 IST)
Updated Date: Sat, 11 May 2024 (18:04 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సోదరి వైఎస్ షర్మిలను రిమోట్ కంట్రోల్ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్పై విరుచుకుపడ్డారు. జగన్ మాటలను సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి.. "జగన్ తన సోదరి, తల్లి ఈ మాటల్లో నిజముందా అనే తేల్చుకోవాలన్నారు.
వివేకా మర్డర్ మిస్టరీతో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. తన బాబాయ్ హత్యపై కుటుంబ సభ్యులు అడిగిన ప్రశ్నలకు నా వద్దకు వచ్చే ముందు సమాధానం చెప్పాలి" అని రేవంత్ రెడ్డి అన్నారు.
జగన్ తన సొంత కుటుంబ సభ్యులను కూడా ఒప్పించే స్థితిలో లేరని, అలాంటప్పుడు తనపై వ్యాఖ్యానించడం ఏంటని రేవంత్ అన్నారు. పొరుగు రాష్ట్రానికి తోటి సీఎంగా ఉన్న జగన్కు శుభాకాంక్షలు చెబుతున్నానని, అయితే ఇలాంటి అర్థరహిత వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం ఇవ్వగలనని రేవంత్ చురకలంటించారు.