Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్నాబ్ గోస్వామిపై దుండగుల దాడి.. ఢిల్లీలో కలకలం

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (09:42 IST)
ప్రముఖ జాతీయ ఇంగ్లీష్ టీవీ చానెల్ అయిన రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి దంపతులపై గురువారం వేకువజామున దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. ముంబైలోని స్టూడియో నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ దాడిలో గోస్వామి దంపతులకు ఎలాంటి గాయాలుకాలేదు. 
 
కానీ, వారు ప్రయాణిస్తున్న కారు మాత్రం దెబ్బతింది. ఈ దాడిపై అర్నాబ్‌ గోస్వామి, సమియా గోస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 
 
కాగా, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియాలో విశ్వసనీయత లోపించిందంటూ అర్నాబ్ గోస్వామి బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసి 24 గంటలకు తిరగక ముందే ఈ దాడి జరగడం గమనార్హం. 
 
కాగా, మహారాష్ట్రలోని పాల్‌ఘార్‌లో ఇద్దరు సాధువులు, ఓ డ్రైవర్‌పై గుంపు దాడి ఘటన నేపథ్యంలో టీవీ లైవ్‌ చర్చలో అర్నాబ్‌ తన రాజీనామాను ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్టు చేసినట్లు ముంబై జోన్‌ 3 డీసీపీ ప్రకటించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments