Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో ఊరట

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (07:35 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకాల అమలులో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదని దాఖలైన పిటిషన్​ను ఉన్నత ధర్మాసనం కొట్టివేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం జరుగుతుందని వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తెలంగాణ వివరణ ఇచ్చింది. హైకోర్టులో కేసు ఉండటంతోనే కాస్త ఆలస్యమైందని అఫిడవిట్​లో తెలంగాణ సీఎస్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం కోర్టు ధిక్కరణ కేసును కొట్టేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉన్న కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు ఆగస్టు 19నే కొట్టేసింది. ఇరు రాష్ట్రాల సీఎస్​ల అఫిడవిట్లతో సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు పాఠశాలల్లో మౌలిక వసతులపై ఉన్నత ధర్మాసనం ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించింది.

నియామకాల్లో సుప్రీం ఆదేశాలు అమలు చేయలేదని పిటిషన్ వేసిన జేకే రాజు, వెంకటేష్​లకు అభ్యంతరం ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చునని సూచించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments